దేశంలో కొత్తగా 45,951 క‌రోనా కేసులు

మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,03,62,848
మొత్తం మృతుల సంఖ్య 3,98,454

న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా కరోనా రోజువారీ కేసుల సంఖ్య, మరణాలు తగ్గుముఖం పడుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 45,951 కేసులు న‌మోద‌య్యాయ‌ని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్ర‌క‌టించింది. దాని ప్రకారం.. 24 గంట‌ల్లో 60,729 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,03,62,848కు చేరింది.

ఇక మరణాల విషయానికొస్తే, నిన్న 817 మంది క‌రోనాతో ప్రాణాలు కోల్పోయారు. దీంతో మృతుల సంఖ్య మొత్తం 3,98,454 కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 2,94,27,330 మంది కోలుకున్నారు. 5,37,064 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. ఇప్ప‌టి వ‌ర‌కు 33,28,54,527 డోసుల వ్యాక్సిన్లు వేశారు

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/