దేశంలో కొత్తగా 38,353 క‌రోనా కేసులు

మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,20,36,571
మృతుల సంఖ్య మొత్తం 4,29,179

న్యూఢిల్లీ : దేశంలో రోజువారీ కేసులు నిన్న భారీగా తగ్గగా.. తాజాగా మళ్లీ పెరిగాయి. గడిచిన 24గంటల్లో కొత్తగా 38,353 కేసులు న‌మోద‌య్యాయ‌ని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్ర‌క‌టించింది. దీంతో దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,20,36,571కు చేరింది.

ఇక మరణాల విషయానికొస్తే… నిన్న 497 మంది క‌రోనాతో ప్రాణాలు కోల్పోయారు. దీంతో మృతుల సంఖ్య మొత్తం 4,29,179కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 3,12,20,981 మంది కోలుకున్నారు. 3,86,351 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 51,90,80,524 వ్యాక్సిన్ డోసులు వేసినట్టు అధికారులు ప్ర‌క‌టించారు. రిక‌వ‌రీ రేటు 97.45 శాతంగా ఉంది.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/telangana/