తెలంగాణలో కొత్తగా 346 కరోనా కేసులు
మొత్తం కేసుల సంఖ్య 2,89,135
Hyderabad: తెలంగాణలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గత 24 గంటల్లో అంటే మొన్న రాత్రి 8 గంటల నుంచి నిన్న రాత్రి 8 గంటల వరకూ రాష్ట్రంలో కొత్తగా 346 మందికరోనా బారిన పడ్డారు.
దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,89,135కి చేరింది. అదే సమయంలో కరోనా కాటుకు ఇద్దరు బలయ్యారు. దీంతో రాష్ట్రంలో కరోనా మృతుల సంఖ్య 1,561కి పెరిగింది.
తాజా కెరీర్ సమాచారం కోసం : https://www.vaartha.com/specials/career/