దేశంలో కొత్తగా 33,750 క‌రోనా కేసులు

మొత్తం 4,81,893 మంది మృతి

న్యూఢిల్లీ: దేశంలో క‌రోనా కేసుల సంఖ్య భారీగా పెరిగిపోయింది. నిన్న దేశంలో 33,750 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయ‌ని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. అలాగే, నిన్న‌ 10,846 మంది క‌రోనా నుంచి కోలుకున్నారని పేర్కొంది. 123 మంది క‌రోనా వ‌ల్ల ప్రాణాలు కోల్పోయార‌ని వివ‌రించింది.

దేశంలో ప్ర‌స్తుతం 1,45,582 మంది ఆసుప‌త్రులు, హోం క్వారంటైన్లలో చికిత్స తీసుకుంటున్నారని తెలిపింది.. కోలుకున్న వారి సంఖ్య మొత్తం 3,42,95,407గా ఉందని పేర్కొంది. 4,81,893 మంది క‌రోనా వ‌ల్ల ప్రాణాలు కోల్పోయార‌ని తెలిపింది. ఇక ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 1,45,68,89,306 క‌రోనా వ్యాక్సిన్ల డోసులు వాడిన‌ట్లు పేర్కొంది.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/