ఫైవ్ స్టార్ హోటళ్లకు బాంబు బెదిరింపులు
లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థ పేరిట బాంబు బెదిరింపులు..ఈమెయిల్ పంపిన దుండగుడు
ముంబయి: ముంబయిలో బాంబు బెదిరింపులు రావడం కలకలం రేపుతున్నాయి. ముంబయిలోని 4 ఫైవ్ స్టార్ హోటళ్లకు లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థ పేరిట బాంబు బెదిరింపులు వచ్చాయి. ఫైవ్ స్టార్ హోటళ్లకు ఓ వ్యక్తిని ఈమెయిల్స్ పంపి, బాంబు దాడులు చేయనున్నట్లు తెలిపాడు. తాము ఈ దాడులకు పాల్పడకుండా ఉండాలంటే వెంటనే బిట్కాయిన్ల రూపంలో తమకు పెద్ద మొత్తంలో డబ్బు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. హోటల్ లీలా, హోటల్ ప్రిన్సెస్, హోటల్ పార్క్, హోటల్ రమదా ఇన్లకు ఈమెయిల్స్ అందాయి. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఆ హోటళ్లకు చేరుకుని తనిఖీలు చేపట్టారు. ఎటువంటి అనుమానాస్పద వస్తువులు లభించలేదని తెలిపారు. అయితే, ముందు జాగ్రత్తగా భాగంగా బాంబ్ స్క్వాడ్ సిబ్బందిని ఆయా హోటళ్ల వద్ద ఉంచారు. ఆయా హోటళ్ల వద్ద భద్రతను పెంచారు. యాంటీ టెర్రరిస్ట్ టీమ్తో పాటు క్రైం బ్రాంచ్ అధికారులు విచారణ ప్రారంభించారు.
తాజా ఏపి వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/