మన్యంలో మరోసారి ఎన్ కౌంటర్

మన్యంలో మరోసారి ఎన్ కౌంటర్ జరుగగా..ఈ ఎన్ కౌంటర్ లో ముగ్గురు మావోలు మృతి చెందారు. దంతేవాడ జిల్లాలో కూంబింగ్ నిర్వహిస్తుండగా.. భద్రతా సిబ్బందికి, నక్సలైట్లకు మధ్య జరిగిన ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ముగ్గురు నక్సలైట్లు మరణించారు. సుక్మా సరిహద్దులోని తుమక్‌పాల్, డబ్బా కున్నా గ్రామాల మధ్య ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు.

కాటే కళ్యాణ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దబ్బకున్న గ్రామ సమీపంలోని కొండపై భద్రతా సిబ్బంది ఉమ్మడి బృందం సాయంత్రం 5:30 గంటలకు యాంటీ నక్సల్స్ ఆపరేషన్‌కు బయలుదేరినప్పుడు ఎదురుకాల్పులు సంభవించాయని ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (బస్తర్ రేంజ్) సుందర్‌రాజ్ తెలిపారు.