మహారాష్ట్రలో ఘోర బస్సు ప్రమాదం..25 మంది సజీవ దహనం

మహారాష్ట్రలో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. రన్నింగ్ బస్సులో మంటలు చెలరేగడంతో 25మంది ప్రయాణికులు సజీవ దహనం అయ్యారు. మహారాష్ట్ర నుంచి పుణె వెళ్తున్న బస్సు సమృద్ధి మహా మార్గ్ దగ్గర రాగా సడెన్ గా మంటలు చెలరేగాయి. ప్రయాణికులంతా నిద్రలో ఉన్నారు. ఆ సమయంలో బస్సు టైరు పేలి.. పల్టీ కొట్టింది. దాంతో.. ఒక్కసారిగా మంటలు వచ్చాయి. ఆ మంటల్ని నిద్రలో ఉన్న ప్రయాణికులు గమనించలేదు. ఆ మంటలు క్షణాల్లో బస్సు అంతా వ్యాపించాయి.

ప్రయాణికులు తప్పించుకునేంత సమయం కూడా దొరకలేదు. దాంతో.. ప్రయాణికుల్లో 25 మంది మంటల్లో సజీవ దహనం అయ్యారు. మరో 8 మంది గాయలతో బయటపడ్డారు. మంటల ధాటికి బస్సు పూర్తిగా కాలిబూడిదైంది. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను బుల్దానా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బస్సులో మొత్తం 32 మంది ఉన్నట్లు సమాచారం. ప్రమాదానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.