సిద్ధరామయ్య ప్రమాణ స్వీకారానికి సీఎం కేసీఆర్ కు ఆహ్వానం

కర్ణాటక సీఎంగా సిద్ధరామయ్య ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఈ నెల 20 న బెంగళూరులోని కంఠీవ స్టేడియంలో మధ్యాహ్నం 12.30 గంటలకు సిద్ధరామయ్య రెండోసారి సీఎం గా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ క్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆహ్వానం అందింది. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ,ప్రియాంక చీఫ్ గెస్టులుగా హాజరుకానున్నారు.

వీరితో పాటు సిద్దారామయ్య ప్రమాణస్వీకారోత్సవానికి తమిళనాడు, వెస్ట్ బెంగాల్, జార్ఖండ్, బీహార్, ఒడిశా ముఖ్యమంత్రులకు ఆహ్వానం పంపింది కాంగ్రెస్. తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా ఈ కార్యక్రమానికి హాజరు కావాలని కాంగ్రెస్ ఆహ్వానించింది. అయితే ఏపీ సీఎం జగన్ కు మాత్రం ఆహ్వానం అందలేదని తెలుస్తోంది. అయితే ఈ ప్రమాణ స్వీకారానికి కేసీఆర్ హాజరు అవుతారని తెలుస్తుంది.