దేశంలో కొత్తగా 2,067 కరోనా కేసులు

న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసుల సంఖ్య క్రితం రోజుతో పోల్చితే భారీగా పెరిగింది. మరో 2,067 మందికి పాజిటివ్​గా తేలింది. వైరస్ కారణంగా కొత్తగా 40 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 1,547 మంది కోలుకున్నారు. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4 కోట్ల 30లక్షల 47వేల పైకి చేరింది. మరణాల సంఖ్య 5లక్షల 22వేల మార్కును అధిగమించింది.

దేశంలో కరోనా టీకా పంపిణీ వేగంగా సాగుతోంది. మంగళవారం 17,23,733 మందికి టీకాలు అందించారు. దీంతో ఇప్పటివరకు పంపిణీ చేసిన డోసుల సంఖ్య 1,86,90,56,607కు చేరింది. మరో 4,21,183 మందికి కరోనా టెస్టులు నిర్వహించారు. మరోవైపు, ప్రపంచవ్యాప్తంగా 5,96,511 కొత్త కేసులు నమోదయ్యాయి. మహమ్మారి ధాటికి 2,302 మంది ప్రాణాలు కోల్పోయారు. దక్షిణ కొరియా, జర్మనీ, ఆస్ట్రేలియా, ఇటలీ, ఫ్రాన్స్​ దేశాల్లో కొవిడ్​ ఉద్ధృతి తీవ్రంగా ఉంది.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/