దేశంలో కొత్తగా 20,139 కరోనా కేసులు
యాక్టివ్ కేసులు.. 1,36,076
న్యూఢిల్లీః దేశంలో కరోనా రోజువారీ కేసులు భారీ నమోదవుతున్నాయి. 145 రోజుల తర్వాత కేసులు 20వేల మార్కును దాటాయి. బుధవారం ఉదయం నుంచి గురువారం ఉదయం వరకు 20,139మంది వైరస్ బారినపడగా.. మరో 38 మంది ప్రాణాలు కోల్పోయారు. కొవిడ్ నుంచి తాజాగా 16,482 మంది కోలుకున్నారు. మొత్తం కోలుకున్నవారి సంఖ్య 98.49 శాతానికి పడిపోయింది. మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసుల సంఖ్య 0.31 శాతానికి పెరిగింది. రోజువారీ పాజిటివిటీ రేటు మాత్రం 5.1 శాతంగా ఉంది. భారత్లో బుధవారం 13,44,714 మందికి టీకాలు అందించగా.. ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్ డోసుల సంఖ్య 1,99,27,27,559కి చేరింది. మరో 3,94,774 మందికి కరోనా నిర్ధరణ పరీక్షలు చేశారు.
తాజా ఏపి వార్తల కోసం క్లిక్ చేయండిః https://www.vaartha.com/andhra-pradesh/