తమిళనాడులో కల్తీ మద్యానికి మరో ఇద్దరు మృతి

తమిళనాడులో గత కొద్దీ రోజులుగా కల్తీ మద్యం సేవించి ప్రాణాలు వదులుతున్నారు. ఈ మధ్యనే విల్లుపురం జిల్లా, చెంగల్ పట్టు జిల్లాల్లో కల్తీ మద్యం తాగి 14 మంది మృతి చెందగా.. పలు హాస్పటల్స్ లలో ఇంకా 50 మందికి పైగా చికిత్స పొందుతున్నారు. తాజాగా తంజావూరు జిల్లాలో ఓ బారులో మద్యం తాగిన ఇద్దరు వ్యక్తులు మృతి చెందడం కలకలం రేపుతోంది.

ఈ ఘటన పట్ల స్థానికులు ఆందోళన చేపట్టగా ..తంజావూరు కలెక్టర్ దినేష్ ఆలివర్ ఘటనా స్థలానికి వచ్చి చనిపోయిన ఇద్దరి బ్లడ్ శాంపిల్స్ తీసుకెళ్లి ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపించారు. మద్యంలో సైనైడ్ కలవడంతోనే చనిపోయినట్లు పోస్టుమార్టం రిపోర్టులో తేలింది. దీంతో మద్యంలో విషం కలిపింది ఎవరా ? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.