దేశంలో కొత్తగా 1,957 కరోనా కేసులు

New corona virus strain
corona virus

న్యూఢిల్లీః దేశంలో గడిచిన 24 గంటల్లో రెండు వేల దిగువనే కొత్త కేసులు నమోదయ్యాయి. నిన్న 2,76,125 నిర్ధారణ పరీక్షలు చేయగా… 1,957 పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,46,16,394కు చేరింది. 27,374 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. నిన్న కరోనా నుంచి 2,654 మంది కోలుకున్నట్లు తెలిపింది. కరోనా మహమ్మారి కారణంగా దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 5,28,822 మంది మరణించారు.

కాగా, మొత్తం కేసుల్లో 0.06 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. రికవరీ రేటు 98.75 శాతం, మరణాలు 1.02 శాతం ఉందని తెలిపింది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 219 కోట్ల కరోనా వ్యాక్సిన్‌ డోసులు పంపిణీ చేసినట్లు వెల్లడించింది.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/andhra-pradesh/