దేశంలో కొత్తగా 18,815 కరోనా కేసులు

యాక్టివ్​ కేసులు.. 1,22,335

corona virus-india

న్యూఢిల్లీః దేశంలో కొత్తగా 18,815 కరోనా కేసులు నమోదయ్యాయి. మరో 38 మంది ప్రాణాలు కోల్పోయారు. రోజువారీ కేసుల సంఖ్య గురువారంతో పోలిస్తే 100కు పైగా కేసులు తగ్గాయి. కొవిడ్​ నుంచి 15,899 మంది కోలుకున్నారు. మొత్తం కోలుకున్నవారి సంఖ్య 98.52 శాతం వద్ద స్థిరంగా ఉంది. మొత్తం కేసుల్లో యాక్టివ్​ కేసుల సంఖ్య 0.27 శాతంగా ఉంది. రోజువారీ పాజిటివిటీ రేటు 4.96 శాతానికి పెరిగింది.

దేశంలో గురువారం 17,62,441 మందికి టీకాలు అందించగా.. ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్​ డోసుల సంఖ్య 1,98,51,77,962కు చేరింది. మరో 3,79,470 మందికి కరోనా నిర్ధరణ పరీక్షలు చేశారు. ప్రపంచదేశాల్లో కరోనా వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. కొత్తగా 9,25,494 మంది వైరస్​ బారినపడ్డారు. మరో 1,725 మంది మహమ్మారితో ప్రాణాలు విడిచారు. మొత్తం కేసుల సంఖ్య 55,85,51,294కు చేరింది. ఇప్పటివరకు వైరస్​తో 63,68,901 మంది మరణించారు. ఒక్కరోజే 6,16,015 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 53,20,62,157కు చేరింది

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/news/international-news/