భారత్‌లో కొత్తగా 16,738 కరోనా కేసులు

మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,10,46,914..మొత్తం మృతుల సంఖ్య 1,51,708

న్యూఢిల్లీ: భారత్‌లో కొత్తగా న‌మోదైన క‌రోనా కేసుల వివరాలను కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు ఉదయం విడుదల చేసింది. వాటి ప్రకారం, దేశంలో గత 24 గంటల్లో 16,738 మందికి కరోనా నిర్ధారణ అయింది. అదే స‌మ‌యంలో 11,799 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,10,46,914కు చేరింది.

గడచిన 24 గంట‌ల సమయంలో 138 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,56,705 కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 1,07,38,501 మంది కోలుకున్నారు. 1,51,708 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. ఇప్ప‌టివ‌ర‌కు 1,26,71,163మందికి వ్యాక్సిన్ వేశారు. కాగా, దేశంలో నిన్నటి వరకు మొత్తం 21,38,29,658 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న 7,93,383 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/