దేశంలో కొత్తగా 12,213 కరోనా కేసులు

యాక్టివ్​ కేసులు.. 58,215

న్యూఢిల్లీ : దేశంలో కరోనా రోజువారీ​ కేసులు భారీగా పెరిగాయి. బుధవారం ఉదయం నుంచి గురువారం ఉదయం వరకు 12,213 మంది వైరస్​ బారిన పడ్డారు. మరో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. బుధవారం 7,624 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 98.66 శాతానికి చేరింది. మృతుల సంఖ్య 1.21 శాతంగా ఉంది. మొత్తం కేసుల్లో యాక్టివ్​ కేసుల సంఖ్య 0.12 శాతం వద్ద ఉంది. డైలీ పాజిటివిటీ రేటు 2.35 శాతంగా ఉంది.

దేశంలో బుధవారం 15,21,942 మందికి టీకాలు అందించగా.. ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్​ డోసుల సంఖ్య 1,95,67,37,014 కోట్లకు చేరింది. మరో 5,19,419మందికి కరోనా టెస్టులు నిర్వహించారు. కాగా, ప్రపంచదేశాల్లో కరోనా కేసులు పెరిగాయి. ఒక్కరోజే 601,129 మంది వైరస్​ బారినపడ్డారు. మరో 1,368 మరణాలు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 542,428,261కు చేరింది. మరణాల సంఖ్య 6,336,471కు చేరింది. ఒక్కరోజే 532,972 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 517,498,965గా ఉంది.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/