మార్చి 3 నుంచి ఎంబీబీఎస్ ఫస్ట్​ ఇయర్​​ పరీక్షలు

నోటిఫికేషన్ విడుదల చేసిన కాళోజీ హెల్త్ వర్సిటీ

హైదరాబాద్‌: కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆప్‌ హెల్త్‌ సైన్సెస్‌ ఎంబీబీఎస్‌ పరీక్షల నిర్వహణపై నోటిఫికేషన్‌ విడుదల చేసింది. మార్చిజఏప్రిల్ లో పరీక్షలను నిర్వహిస్తున్నట్టు ప్రకటించింది. మూడు విభాగాలుగా పరీక్షలను విభజించి నోటిఫికేషన్లను ఇచ్చింది. పాత నిబంధనల ప్రకారం 2016-17, 2017 -18, 2018 -19 విద్యా సంవత్సరంలో ప్రవేశాలు పొందిన విద్యార్థులు, కొత్త నిబంధనల ప్రకారం 2019-2020 బ్యాచ్ ఫస్టియర్ విద్యార్థులకు మార్చి 23 నుంచి ఏప్రిల్ 3 వరకు పరీక్షలను నిర్వహించనుంది.

పాత నిబంధనల ప్రకారం హాజరు 75 శాతం, ఇంటర్నల్ మార్కులు 35 శాతం ఉన్నవారిని అర్హులుగా ప్రకటించిన వర్సిటీ.. కొత్త రూల్స్ ప్రకారం 75% హాజరు, 40% మార్కులను అర్హతగా ప్రకటించింది. ఇక, 2016 -17 బ్యాచ్ కు చెందిన విద్యార్థుల మూడో సంవత్సరం రెండో సెమిస్టర్ పరీక్షలను ఏప్రిల్ 6 నుంచి 22 వరకు పరీక్షలను నిర్వహిస్తున్నట్టు వెల్లడించింది.