ట్విట్టర్ బ్లూ టిక్ ను కోల్పోయిన చిరంజీవి, పవన్ కళ్యాణ్ , కోహ్లీ

twitter-removes-blue-tick-for-many-vips

ట్విట్టర్ బ్లూటిక్ సబ్ స్క్రిప్షన్ ప్లాన్ రూల్ ను అమలుచేయడం మొదలుపెట్టింది. ఇప్పటివరకు ఫ్రీగా ఇచ్చిన ట్విట్టర్ బ్లూటిక్.. ఇకనుంచి డబ్బులు కట్టి సబ్ స్క్రిప్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఎవరైతే డబ్బులు కట్టలేదో వాళ్ల బ్లూ టిక్ మార్క్ తొలగిస్తోంది ట్విట్టర్. ఈ నేపథ్యంలో భారత్ లోని పలువురు సినీ, రాజకీయ, క్రీడా రంగాలకు చెందిన ప్రముఖుల బ్లూటిక్స్ తొలగించబడ్డాయి.

షారుఖ్ ఖాన్, అమితాబ్ బచ్చన్, అలియా భట్, యోగి ఆదిత్యనాథ్, రాహుల్ గాంధీ, ఏపీసీఎం జగన్ , టీడీపీ అధినేత చంద్రబాబు , ప్రియాంకగాంధీ, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ తదితరుల ఖాతాలకు బ్లూ టిక్ ను ట్విట్టర్ తొలగించింది. టాలీవుడ్ లో చిరంజీవి, పవన్ కల్యాణ్, మోహన్ బాబు, అల్లు అర్జున్, వెంకటేశ్, ప్రకాశ్ రాజ్, మంచు మనోజ్, మంచు లక్ష్మి, రకుల్ ప్రీత్ సింగ్, నితిన్, రామ్ చరణ్, నాగచైతన్య, అక్కినేని అఖిల్ తదితరుల ఖాతాలకు బ్లూ టిక్ ను తొలగించింది. జూనియర్ ఎన్టీఆర్, అక్కినేని నాగార్జున, మహేశ్ బాబు, మంచు విష్ణు బ్లూ టిక్ లు ఉన్నాయి. తమిళ స్టార్లు రజనీకాంత్, విజయ్, శింబు కూడా బ్లూ టిక్ కోల్పోయారు.

ఈ బ్లూ టిక్ ఉన్న సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు, క్రీడాకారులు, సంస్థల ఖాతాలు ఒరిజినల్ అని లెక్క. ఇతరులు ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసినా… అవి ఒరిజినల్ అకౌంట్లు కావని యూజర్లకు అర్థమయ్యేందుకు బ్లూ టిక్ విధానాన్ని ట్విట్టర్ ప్రవేశపెట్టింది. ఇప్పుడు బ్లూ టిక్ లకు ఛార్జ్ చేయడం ద్వారా ఆదాయాన్ని పెంచుకోవాలని మస్క్ భావిస్తున్నారు.