ఉద్యోగుల జీతాలు, పెన్షన్‌లు చెల్లించలేదు: రఘురామ

ఏపీ ఆర్ధిక పరిస్థితిపై రాష్ట్రపతికి ఎంపీ లేఖ

న్యూఢిల్లీ : ఏపీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చాలా దారుణంగా ఉందని, ఆర్ధిక సంక్షోభంలో చిక్కుకుందని దీనిపై రాష్ట్రపతి రామనాథ్ కొవింద్‌కు లేఖ రాశానని ఎంపీ రఘురామకృష్జంరాజు అన్నారు. సోమవారం ఆయన మాట్లాడుతూ.. ప్రధాని మోడీ కూడా క్లారిఫికేషన్ అడిగారన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో 142 శాతం బడ్జెట్ అంచనాలకు మించి సర్కార్ అప్పులు చేసిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అప్పులు చూస్తుంటే పరిస్థితి అత్యంత భయంకరంగా ఉందన్నారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ఎప్పుడు కులుతుందోనని భయం వేస్తోందన్నారు.

బడ్జెట్ అంచనాలకు మించి రెవెన్యూలోటు, ద్రవ్యలోటు ఉన్నాయని రఘురామ వ్యాఖ్యానించారు. రాష్ట్రం చేస్తున్న అప్పులో 42 శాతం పాత అప్పులపై వడ్డీ చెల్లించడానికే సరిపోతుందన్నారు. జులై రెండో వారం వరకు కూడా ఉద్యోగుల జీతాలు, పెన్షన్‌లు చెల్లించలేదని, ప్రస్తుతం రాష్ట్రం ఎదుర్కొంటున్న ఆర్థిక పరిస్థితి చరిత్రలో ఇంతకు ముందు ఎన్నడూ లేదన్నారు. తక్షణం ఏపీలో కేంద్రం ఆర్థిక అత్యవసర పరిస్థితిని విధించాలని ఆ లేఖలో రాష్ట్రపతిని పేర్కొన్నట్లు ఎంపీ రఘురామ కృష్ణంరాజు చెప్పారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/news/national/