సిఎం జగన్ మకాం విశాఖలో?
ఇంటి స్థలం అన్వేషణలో వైఎస్ఆర్సిపి నేతలు
విశాఖ: ఏపి సిఎం జగన్ విశాఖకు వెళ్లనున్నారా? అంటే అవుననే అంటున్నారు వైఎస్ఆర్సిపి నేతలు. ఏపిలో మూడు రాజధానుల్లో ఒకటైన విశాఖకు సిఎం జగన్ మకాం మార్చనున్నారు. అయితే ఆయన ఎక్కడ ఉండాలన్న దానిపై వైఎస్ఆర్సిపికి చెందిన కొందరు ముఖ్యనేతలు పరిశీలిస్తున్నారు. జగన్ శాశ్వత నివాసం కోసం భీమిలి, కాపులుప్పాడ, తిమ్మాపురం, మధురవాడ, రుషికొండ ప్రాంతాల్లో స్థలాల కోసం అన్వేషిస్తున్నారు. నగర శివారులోని ఏదైనా కొండపై నివాసం ఉంటే సహజసిద్ధమైన భద్రత ఉంటుందని భావిస్తున్నారు. మరోవైపు ఓ ఫైవ్ స్టార్ హోటల్ లో సిఎం కొన్ని నెలల పాటు అద్దె ప్రాతిపదికన ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగా బీచ్ రోడ్డులో నిర్మాణంలో ఉన్న ఓ స్టార్ హోటల్ నిర్మాణ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తున్నట్టు సమాచారం. ఇంకోవైపు, భీమిలి-విశాఖ మార్గంలో ఓ విద్యాసంస్థకు కొన్ని భవనాలు ఉన్నాయి. వీటిని కూడా అధికారులు పరిశీలిస్తున్నారు.
తాజా బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/business/