సైకిళ్లను కూడా వదలకుండా పార్టీ రంగులేసిన వైస్సార్సీపీ

మొన్నటి వరకు గ్రామా పంచాయితులకు , స్కూల్స్ కు, వంతెనలకు , ప్రభుత్వ భవనాలకు , వాటర్ ట్యాంక్ లకు పార్టీ రంగులేసిన అధికార పార్టీ వైస్సార్సీపీ..ఇప్పుడు ఎవ్వరో పంచె సైకిళ్లకు కూడా పార్టీ రంగులేసి పంచుతూ నవ్వుల పాలవుతున్నారు. రాష్ట్రంలో వైస్సార్సీపీ తీరు సొమ్ము ఒకరిది..సోకు ఒకరిది అన్నట్లు తయారైంది. రాష్ట్రంలో అరబిందో ఫార్మా కంపెనీ తన ఫౌండేషన్‌ ద్వారా సుమారు రూ.1.75 కోట్లతో 2500 సైకిళ్ల పంపిణీకి ముందుకొస్తే..వారు పంచె సైకిళ్లకు కూడా పార్టీ రంగులేసి పబ్లిసిటీ చేస్తున్నారు వైస్సార్సీపీ నేతలు.

అనకాపల్లి నియోజకవర్గంలో 9, 10 తరగతులు చదువుతున్న విద్యార్థినులకు అరబిందో ఫార్మా కంపెనీ తన ఫౌండేషన్‌ ద్వారా సుమారు రూ.1.75 కోట్లతో 2500 సైకిళ్ల పంపిణీకి ముందుకు వచ్చింది. ఇదే అదనుగా భావించి సైకిళ్లకు పార్టీ రంగులు వేసేశారు వైస్సార్సీపీ నేతలు. వీటిని మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌, అరబిందో ఫార్మా ఎండీ నిత్యానందరెడ్డి విద్యార్థినులకు శనివారం అందించారు. ఇది చూసినా వారంతా నవ్వుకుంటున్నారు. త్వరలో స్కూల్ పిల్లలకు ఇచ్చే డ్రెస్ లపై కూడా పార్టీ కలర్స్ వేస్తారు కావొచ్చు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.