కడపలో వైస్సార్సీపీ కార్యకర్త దారుణహత్య

కడప జిల్లాలో అధికార పార్టీ వైస్సార్సీపీ కార్యకర్త దారుణ హత్యకు గురయ్యాడు. భూతగాదాలే ఈ హత్య కు కారణంగా తెలుస్తుంది. పోలీసుల తెలిపిన ప్రకారం..కడపకు చెందిన శ్రీనివాసులురెడ్డికి మరికొందరికి మధ్య గత కొంతకాలంగా భూతగాదాలు నడుస్తున్నాయి. ఇవి మరింత పెరగడంతో శ్రీనివాస్‌రెడ్డిపై కక్ష పెంచుకున్న ప్రత్యర్థులు అతడి హత్యకు ప్లాన్ చేశారు.

శుక్రవారం ఉదయం శ్రీనివాసులు జిమ్ నుండి ఇంటికి వస్తుండగా..అతడిపై కత్తులతో దాడిచేశారు. విక్షణ రహితంగా పొడిచారు. రక్తపు మడుగులో ఉన్న ఆయనను స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.