రేపు వైఎస్సార్‌ పెన్షన్‌ కానుక పెంపు..

న్యూ ఇయర్ కానుకగా సీఎం జగన్..వృద్ధాప్య పెన్షన్ రూ. 3000 లకు పెంచారు. పెన్షన్‌ను పెంచుతామని ఇచ్చిన హామీని.. ఇప్పుడు అమలు చేయనున్నారు. వృద్ధులకు ఒంటరి మహిళలు, వితంతువులు, దివ్యాంగులకు అండగా నిలవడానికి పెన్షన్‌ను టెన్షన్‌ లేకుండా ఇచ్చేందుకు రంగం సిద్ధమైంది. ఇకపై వృద్ధులకు పెంచిన పెన్షన్ 3 వేల రూపాయలను అందించనుంది.

రేపు కాకినాడ రంగరాయ మెడికల్‌ కాలేజ్‌ గ్రౌండ్స్‌లో నిర్వహించబోయే బహిరంగ సభలో సీఎం పాల్గొనబోతున్నారు. అనంతరం సభలో.. వైఎస్సార్‌ పెన్షన్‌ కానుక పెంపు కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమం అనంతరం మధ్యాహ్నం తాడేపల్లికి తిరుగు ప్రయాణం కానున్నారు.

పెన్షన్ల పెంపు పై కార్యక్రమంలో సీఎం జగన్.. 2,750 రూపాయల నుంచి మూడు వేల రూపాయలకు పెన్షన్ పెంచనున్నారు. కాగా.. ప్రభుత్వం ఏటా 66.34 లక్షల మందికి పెన్షన్లు అందిస్తుంది. పెన్షన్ల పై ఏటా వ్యయం రూ.23,556 కోట్లు చేయనుంది. జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు పెన్షన్ల ద్వారా అందించిన మొత్తం సుమారు 83,526 కోట్లు.