ఆర్టీసీ బస్సును ఢీకొన స్కూటీ ..దగ్ధమైన బస్సు
సూర్యాపేట: సూర్యాపేట జిల్లాలోని మునగాల మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. మునగాల మండలంలోని ఇందిరానగర్ వద్ద ఆర్టీసీ రాజధాని బస్సును ఓ బైకు కొట్టింది. అయితే బస్సు కిందికి మోటారుసైకిల్ దూసుకెళ్లడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అవి బస్సుకు అంటుకోవడంతో పూర్తిగా దగ్ధమయింది.
అప్రమత్తమైన బస్సు డ్రైవర్ ప్రయాణికులు అందరిని కిందికి దింపారు. ఈ ఘటనలో ఎం.రాజు(45) అనే వ్యక్తి మృతి చెందాడు. మృతుడు రాజును మునగాల మండలం ఇందిరానగర్కు చెందిన వ్యక్తిగా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. హైదరాబాద్లోని మియాపూర్ డిపోకు చెందిన రాజధాని బస్సు హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్తుండగా ప్రమాదం జరిగిందన్నారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.