17 మెడికల్ కాలేజీలకు వైస్సార్ పేరు

రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేయబోతున్న 17 మెడికల్ కాలేజీలకు డాక్టర్ వైఎస్సార్ ప్రభుత్వ వైద్య కళాశాలలుగా ప్రభుత్వం నామకరణం చేసింది. ఈ మేరకు వైద్య శాఖ ముఖ్యకార్యదర్శి కృష్ణబాబు ఉత్తర్వులు జారీ చేశారు. వైద్య రంగం బలోపేతానికి YSR విశేషంగా కృషి చేశారని ప్రభుత్వం పేర్కొంది.

ఆరోగ్య శ్రీ, వైద్య కళాశాలల ఏర్పాటు, 108, 104 వాహనాల వ్యవస్థతో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారని తెలిపింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 8,480 కోట్ల రూపాయల పెట్టుబడితో 17 కొత్త మెడికల్ కాలేజీలను నిర్మించినట్లు మంత్రి రజిని పేర్కొన్నారు. కాలేజీల పనులు శరవేగంగా జరుగుతున్నాయని తెలిపారు.