ప్రేమించిన యువకుడిపై యువతి యాసిడ్ దాడి
మరో యువతిని పెళ్లి చేసుకున్నాడంటూ దాడి
నంద్యాల: కర్నూలు జిల్లా నంద్యాల మండలం పెద్ద కొట్టాలలో ఓ యువకుడిపై యువతి యాసిడ్ దాడి చేసింది. ప్రేమించిన యువకుడు తనను మోసం చేశాడన్న ఆగ్రహంతో యాసిడ్ దాడి చేసిందో అమ్మాయి. తనను ప్రేమించి, పెళ్లి చేసుకోకుండా, మరో యువతిని పెళ్లి చేసుకున్నాడంటూ నాగేంద్ర అనే యువకుడిపై ఆమె ఈ దారుణానికి పాల్పడింది. నాగేంద్రపై ఆ యువతి యాసిడ్ దాడి చేయడం ఇది రెండోసారి. వారం రోజుల క్రితం కూడా యువకుడిపై ఆమె యాసిడ్ పోయగా, అతడి చేయి కాలింది. ఆ గాయానికి నాగేంద్ర చికిత్స తీసుకుంటున్నాడు. ఈ ఘటన నుంచి తన మాజీ ప్రియుడు తేరుకోకముందే ఆమె మరోసారి యాసిడ్ దాడి చేసి కలకలం రేపింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/telangana/