గుంటూరు లో బీటెక్ యువతి హత్య

నడి రోడ్డుపై కత్తితో పొడిచి యువకుడు పరారీ

Ramya-File- Deadbody
Ramya-File- Deadbody

Guntur: గుంటూరు నగరంలోని కాకాని రోడ్డులో బీటెక్ యువతి దారుణ హత్యకు గురైంది. విద్యార్థినిని కత్తితో పొడిచి దుండగుడు హత్య చేశాడు. బాధిత యువతి రమ్య ఓ ప్రైవేట్‌ కళాశాలలో బీటెక్ మూడో ఏడాది చదువుతోంది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ప్రమాద స్థలానికి చేరుకుని పరిశీలించారు. అనంతరం మృతదేహాన్ని గుంటూరు జీజీహెచ్‌కు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

తాజా బిజినెస్‌ వార్తల కోసం: https://www.vaartha.com/news/business/