హస్తినలో యోగి ఆదిత్యనాథ్ బిజీ బిజీ
పలువురు ప్రముఖులతో భేటీ
New Delhi: యూపీ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆదివారం ఉదయం లక్నో నుంచి ఢిల్లీకి చేరుకున్నారు. హిండన్ విమానాశ్రయంలో దిగిన ఆయన మధ్యాహ్నం 1 గంటకు బీఎల్ సంతోష్తో కానున్నారు. అనంతరం 3 గంటలకు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుతో భేటీ కానున్నారు. సాయంత్రం 6 గంటలకు బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాను కలుస్తారు . సాయంత్రం 5 గంటలకు ప్రధాని నివాసానికి చేరుకుని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తో సమావేశం కానున్నారు. ప్రధానితో భేటీ అనంతరం రాత్రి 8 గంటలకు రక్షణ మంత్రి రాజ్నాథ్సింగ్తో భేటీ అవుతారు.
కరోనా లాక్ డౌన్ వార్తల కోసం :https://www.vaartha.com/corona-lock-down-updates/