మసూద్ అజాద్ పాకిస్థాన్ లోనే ఉన్నాడుః ఆఫ్ఘనిస్థాన్

తమ దేశంలో మసూద్ ఉన్నాడనే ఆరోపణలను ఖండించిన ఆఫ్ఘాన్

masood azhar
masood azhar

ఇస్లామాబాద్‌ః నిషేధిత ఉగ్రవాద సంస్థ జైషే మహమ్మద్ చీఫ్ మౌలానా మసూద్ అజార్ మీ దేశంలో ఎక్కడున్నాడో చెప్పాలని, ఆయనను అరెస్ట్ చేయాలని ఆఫ్ఘనిస్థాన్ కు పాకిస్థాన్ లేఖ రాసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ కు ఆప్ఘనిస్థాన్ ఘాటు సమాధానాన్ని ఇచ్చింది. మసూద్ అజాద్ మీ పాకిస్థాన్ లోనే ఉన్నాడని ఆప్ఘనిస్థాన్ ప్రభుత్వం తెలిపింది. తమ దేశంలో అజార్ ఉన్నాడనే పాకిస్థాన్ ఆరోపణలను ఆఫ్ఘాన్ విదేశాంగ శాఖ ఖండించింది. తమపై ఇలాంటి ఆరోపణలను మరోసారి చేస్తే… అది రెండు దేశాల సంబంధాలపై ప్రభావం చూపుతుందని వ్యాఖ్యానించింది. అజార్ తమ దేశంలో ఉన్నాడనే ఆరోపణలకు స్పష్టమైన ఆధారాలను చూపాలని డిమాండ్ చేసింది.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/news/national/