వైసీపీ ఆరో లిస్ట్ విడుదల
అసెంబ్లీ ,పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో అధికార పార్టీ వైసీపీ..గత కొద్దీ రోజులుగా నియోజకవర్గ ఇంచార్జ్ లను ప్రకటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఐదు జాబితాలను విడుదల చేసిన అధిష్టానం..శుక్రవారం ఆరో జాబితాను రిలీజ్ చేసింది. ఈ జాబితాలో 6 అసెంబ్లీ స్థానాలు, 4 పార్లమెంట్ స్థానాలకు ఇంఛార్జ్ల పేర్లను ప్రకటించింది.
ఆరో లిస్ట్ చూస్తే..
లోక్సభ స్థానాలకు ఇంఛార్జీలు :
- రాజమహేంద్రవరం – గూడూరి శ్రీనివాస్
- నర్సాపురం – అడ్వకేట్ గూడూరి ఉమాబాల
- గుంటూరు – ఉమ్మారెడ్డి వెంకటరమణ
- చిత్తూరు (ఎస్సీ) – ఎన్.రెడ్డప్ప
అసెంబ్లీ స్థానాలకు ఇంఛార్జీలు :
- మైలవరం – సర్నాల తిరుపతిరావు యాదవ్
- మార్కాపురం – అన్నా రాంబాబు
- గిద్దలూరు – కె. నాగార్జున రెడ్డి
- నెల్లూరు సిటీ – ఎండీ. ఖలీల్ (డిప్యూటీ మేయర్)
- జీడీ. నెల్లూరు – కె.నారాయణస్వామి
- ఎమ్మిగనూరు – బుట్టా రేణుక
మొత్తంగా 6వ లిస్టుతో కలిపి 82 స్థానాలకు సంబంధించి ఇంఛార్జ్ లను మార్చేసింది.