మన పార్టీ గుర్తు సైకిల్ అని చెప్పి మంత్రి ధర్మాన కు షాక్ ఇచ్చిన మహిళ

గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం లోనే కాదు బయట కార్యక్రమాల్లో కూడా వైస్సార్సీపీ నేతలకు ప్రజలు షాకుల మీద షాకులు ఇస్తున్నారు. ఒక్కో చోట సదరు మంత్రినే మీరు ఎవరు అని అడిగిన సందర్భాలు ఉంటె..తాజాగా మంత్రి తమ పార్టీ గుర్తు ఏంటి అని అడిగితే ఏమాత్రం మొహమాట పడకుండా సైకిల్ అని చెప్పి పెద్ద షాక్ ఇచ్చింది. ఈ ఘటన శ్రీకాకుళం ఏడు రోడ్ల కూడలి వార్డు సచివాలయ పరిధిలో జరిగిన ‘జగనన్న సురక్ష’ కార్యక్రమంలో జరిగింది.

శుక్రవారం శ్రీకాకుళం ఏడు రోడ్ల కూడలి వార్డు సచివాలయ పరిధిలో ‘జగనన్న సురక్ష’ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి మంత్రి ధర్మాన ప్రసాదరావు హాజరయ్యారు. ఈ సందర్బంగా వేదిక మీదకు వచ్చిన మహిళను పార్టీ గుర్తు ఏమిటని అడగ్గా… నవ్వుతూ ఆమె సైకిల్ అని చెప్పింది. దీంతో మంత్రి తో పాటు అక్కడున్న వారంతా షాక్ అయ్యారు. వెంటనే సదరు మహిళ సారీ… సారీ… ఫ్యాన్” అంటూ తిరిగి సమాధానం చెప్పింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియా లో వైరల్ గా మారుతుంది. ఈ వీడియో చూసిన తెలుగు తమ్ముళ్లు ..వైస్సార్సీపీ ఎంత ప్రచారం చేసిన ఈసారి సైకిల్ కే అందరి ఓటు అని కామెంట్స్ చేస్తున్నారు.