ఆర్కే బీచ్లో ఓ మహిళ అనుమానాస్పద మృతి..
విశాఖ ఆర్కే బీచ్లో ఓ మహిళ అనుమానాస్పద మృతి కలకలం రేపుతోంది. మృతదేహం ఇసుకలో కూరుపోగా కేవలం ముఖం మాత్రమే బయటకు కనిపిస్తోంది. ఇది హత్యా..? ఆత్మహత్యా అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. సదరు మహిళా గాజువాక నడుపూరికి చెందిన స్వాతిగా గుర్తించారు. నిన్న సాయంత్రం నుంచి ఇంట్లోంచి బయటకు వెళ్లింది. రాత్రి అయినా తిరిగి ఇంటికి రాకపోవడంతో కంగారుపడ్డ కుటుంబసభ్యులు.. పోలీసుల్ని ఆశ్రయించారు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని.. దర్యాప్తు చేస్తుండగానే స్వాతి ఆర్కేబీచ్లో శవమై తేలింది.
డెడ్బాడీ పడి ఉన్న తీరు చూస్తే హత్యేనన్న అనుమానాలు కలుగుతున్నాయి. ఒంటిపై దుస్తులు సరిగా లేవు.. ఇసుకలో సగం డెడ్బాడీ కప్పేసినట్టుగా ఉంది. ఇది ఎవరో కావాలని చంపేసి.. తమ ఆనవాళ్లు దొరక్కుండా ఇసుకలో పాతిపెట్టినట్టు తెలుస్తోంది. ఆర్కేబీచ్ ఒడ్డున ఓ మహిళ అనుమానాస్పద స్థితిలో చనిపోవడం అందర్నీ ఉలిక్కిపడేలా చేసింది.