ప్రారంభమైన తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
హైదరాబాద్: ఏడో రోజు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. శాసనసభను స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మండలిని చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రారంభించారు. ప్రస్తుతం జీరో అవర్ కొనసాగుతోంది. అనంతరం ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ చేపట్టనున్నారు. ఈ బిల్లుపై చర్చ అనంతరం కేసీఆర్ సమాధానం ఇవ్వనున్నారు. ద్రవ్య వినిమయ బిల్లు ఆమోదం అనంతరం శాసనసభ సమావేశాలు నిరవధికంగా వాయిదా పడే అవకాశాలున్నట్టు విశ్వసనీయవర్గాల ద్వారా తెలిసింది.
తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/news/international-news/