ఎర్రగడ్డ మెట్రో స్టేషన్ పైనుంచి దూకి మహిళ ఆత్మహత్య
ఎర్రగడ్డ మెట్రో స్టేషన్ పైనుంచి దూకి ఓ మహి ఆత్మహత్య చేసుకున్న ఘటన బుధువారం ఉదయం చోటుచేసుకుంది. మహబూబ్నగర్ జిల్లా మక్తల్ కు చెందిన మారెమ్మ (70) గా పోలీసులు గుర్తించారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ దవాఖానకు తరలించారు. ఆర్థిక ఇబ్బందులతోనే ఆత్మహత్యకు పాల్పడినట్లు భావిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. గతంలోను ఎర్రగడ్డ మెట్రో స్టేషన్ పైనుంచి దూకి ఓ యువతీ ఆత్మహత్య చేసుకుంది.
ఇదిలా ఉంటె హైదరాబాద్ మెట్రో సిబ్బంది ధర్నా రెండో రోజు కొనసాగుతోంది. ఈరోజు కూడా మెట్రో టికెటింగ్ సిబ్బంది విధులకు హాజరుకాలేదు. తమ వేతనాలు పెంచాలంటూ నిన్నటి నుంచి మెట్రో రైల్ టికెటింగ్ సిబ్బంది నిరసన కొనసాగిస్తున్నారు. ఇదిలా ఉంటే మరోవైపు అమీర్పేట్ మెట్రో స్టేషన్లో కార్యాకలాపాలు యథావిథిగా సాగుతున్నాయి. సాధారణంగా ప్రయాణికుల రాకపోకలు, టికెట్ల జారీ యథాతథంగా జరుగుతున్నాయి.