ఎర్రగడ్డ మెట్రో స్టేషన్ పైనుంచి దూకి మహిళ ఆత్మహత్య

ఎర్రగడ్డ మెట్రో స్టేషన్ పైనుంచి దూకి ఓ మహి ఆత్మహత్య చేసుకున్న ఘటన బుధువారం ఉదయం చోటుచేసుకుంది. మహబూబ్‌నగర్‌ జిల్లా మక్తల్‌ కు చెందిన మారెమ్మ (70) గా పోలీసులు గుర్తించారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ దవాఖానకు తరలించారు. ఆర్థిక ఇబ్బందులతోనే ఆత్మహత్యకు పాల్పడినట్లు భావిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. గతంలోను ఎర్రగడ్డ మెట్రో స్టేషన్ పైనుంచి దూకి ఓ యువతీ ఆత్మహత్య చేసుకుంది.

ఇదిలా ఉంటె హైదరాబాద్​ మెట్రో సిబ్బంది ధర్నా రెండో రోజు కొనసాగుతోంది. ఈరోజు కూడా మెట్రో టికెటింగ్ సిబ్బంది విధులకు హాజరుకాలేదు. తమ వేతనాలు పెంచాలంటూ నిన్నటి నుంచి మెట్రో రైల్‌ టికెటింగ్ సిబ్బంది నిరసన కొనసాగిస్తున్నారు. ఇదిలా ఉంటే మరోవైపు అమీర్​పేట్ మెట్రో స్టేషన్​లో కార్యాకలాపాలు యథావిథిగా సాగుతున్నాయి. సాధారణంగా ప్రయాణికుల రాకపోకలు, టికెట్ల జారీ యథాతథంగా జరుగుతున్నాయి.