‘శ్రీదేవి-చిరంజీవి’ సాంగ్ షూట్ లో శృతి బాగా ఇబ్బంది పడిందట

శృతి హాసన్ నటిస్తున్న తాజా చిత్రాలు సంక్రాంతి బరిలో విడుదల కాబోతున్నాయి. క్రాక్ తర్వాత శృతి నుండి వస్తున్న సినిమాలు వీర సింహ రెడ్డి , వాల్తేర్ వీరయ్య. ఈ రెండు సినిమాల్లో శృతినే హీరోయిన్ కావడం విశేషం. బాలయ్య సరసన వీరసింహరెడ్డి మూవీ లో నటించగా, వాల్తేర్ వీరయ్య లో చిరంజీవి కి జోడిగా నటించింది. ఈ క్రమంలో రెండు సినిమా ప్రమోషన్ లలో శృతి బిజీ గా ఉంది.

తాజాగా వాల్తేర్ వీరయ్య మూవీ గురించి మాట్లాడుతూ..ఈ సినిమా లో శ్రీదేవి – చిరంజీవి సాంగ్ లో మంచు లో చీర తో చాల ఇబ్బంది పడ్డట్లు తెలిపింది. ఆ పాట షూట్‌ను తాను ఏ మాత్రం ఎంజాయ్‌ చేయలేదని .. మంచులో చీర కట్టుకుని డ్యాన్స్ చేయడం చాలా అన్​కమ్​ఫర్టబుల్​గా అనిపించిందని తెలిపింది. ‘ఈ పాట నాకెంతో నచ్చినా, చిత్రీకరణను పూర్తిగా ఆస్వాదించలేకపోయాను. నిజాయతీగా చెప్పాలంటే మరోసారి ఇలా చీర ధరించి మంచులో ఉండే పాట చేయకూడదని భావిస్తున్నా.

ఎందుకంటే, ఇది కాస్త ఇబ్బందికరంగా అనిపించింది. నాకు తెలిసినంత వరకూ ప్రేక్షకులు ఇలాంటివి చూడటానికి ఇష్టపడుతున్నారు. అందుకే ఈ తరహాలో షూట్‌ చేయాల్సి వస్తోంది. అంతేకానీ, ఒక మహిళకు ఇలాంటివి అసౌకర్యంగా ఉంటాయి’’ అని ఆమె చెప్పుకొచ్చింది. బాబీ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ మూవీలో రవితేజ కూడా ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవి శ్రీ మ్యూజిక్ అందిస్తున్నాడు. జనవరి 13 న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

x