తెలంగాణలో కొత్తగా 1,967 మందికి కరోనా

మొత్తం కరోనా కేసుల సంఖ్య 99,391

corona virus – telangana

హైదరాబాద్‌: తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతుంది. ఈరోజు ఉదయం రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ తెలిపిన వివరాల ప్రకారం.. రాష్ట్రంలో కొత్తగా 1,967 మందికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. అదే సమయంలో 8 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోగా, 1781 మంది కోలుకున్నారు. ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 99,391కి చేరింది. ఆసుపత్రుల్లో 21,687 మందికి చికిత్స అందుతోంది. ఇప్పటివరకు 76,967 మంది డిశ్చార్జ్ అయ్యారు. మృతుల సంఖ్య మొత్తం 737కు చేరింది. జీహెచ్‌ఎంసీ పరిధిలో 473 మందికి కొత్తగా కరోనా సోకింది. తెలంగాణలో మొత్తం 8,48,078 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/