రాజగోపాల్ ఫై రేవంత్ చేసిన వ్యాఖ్యలను ఖండించిన ఈటెల ..

రాజగోపాల్ రెడ్డి ఫై పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను బిజెపి ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ ఖండించారు. రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కి , తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. రాజగోపాల్ కాంగ్రెస్ పార్టీ కి రాజీనామా చేయడం ఫై కాంగ్రెస్ నేతలు విమర్శలు చేస్తుంటే..బిజెపి నేతలు మాత్రం వారి మాటల ఫై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాజగోపాల్ ఫై రేవంత్ చేసిన కామెంట్స్ ఫై బిజెపి ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ తప్పుబట్టారు. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై కాంగ్రెస్ నాయకులు విమర్శలు చేయడం తగదన్నారు. వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని సూచించారు. కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన కొంతమంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను టీఆర్ఎస్ పార్టీలో చేర్చుకోలేదా అని ప్రశ్నించారు.

రేవంత్ రెడ్డి బ్లాక్ మెయిల్ కు పాల్పడుతూ రాజకీయంగా ఎదిగారని ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. రేవంత్ రెడ్డి నాలుగు పార్టీలు మారలేదా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీని వాడుకుని ముఖ్యమంత్రి కావాలని రేవంత్ రెడ్డి చూస్తున్నాడని, తమతో చాలామంది ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారని తెలిపారు. రేవంత్ రెడ్డి మాటలు అత్యంత జుగుప్సాకరంగా ఉన్నాయన్నారు. బట్ట కాల్చి మీద వేయడం తగదన్నారు. బ్లాక్ మెయిలింగ్ నుంచి ఈ స్థాయికి వచ్చినట్లుగా రేవంత్ కామెంట్స్ ఉన్నాయని మండిపడ్డారు. ఏదైనా మాట్లాడితే సంస్కారం, సభ్యత ఉండాలన్నారు.

తెలంగాణ ఉద్యమ సమయంలో పార్టీలోకి రావాలని ఆనాడే రాజగోపాల్ రెడ్డిని అడిగారని, కానీ దానికి ఆయన ఒప్పుకోలేదని ఈటల రాజేందర్ అన్నారు. తెలంగాణ ఉద్యమం కోసమే తాము పని చేస్తామని గతంలోనే రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేశారన్నారు. కాంట్రాక్టు రద్దు చేసినా.. ఆర్థికంగా ఇబ్బందులు పెట్టినా కట్టుబడి పని చేసిన వ్యక్తి రాజగోపాల్ రెడ్డి అని తెలిపారు. వాస్తవానికి దేశంలో కాంగ్రెస్ పార్టీ అంతరించిపోతోందన్నారు. కర్నాటక, మహారాష్ట్ర, ఏపీ, తెలంగాణ.. ఇలా ఏ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంది ? అని ప్రశ్నించారు. టీఆర్ఎస్ కు తామే ప్రత్యామ్నాయం తామేనంటూ..కాంగ్రెస్ గొప్పలు చెప్పుకుంటోందన్నారు. ప్రాంతీయ పార్టీలతో కాంగ్రెస్ పొత్తులు పెట్టుకుని..పోటీ చేసిన రాష్ట్రాల్లో టీఆర్ఎస్ సహకరించడం లేదా ? అని ప్రశ్నించారు.