ఖచ్చితంగా ఆరు గ్యారంటీలు అమలు చేస్తాం – మంత్రి పొన్నం

praja-palana-program-will-not-be-extended-in-telangana-says-ponnam-prabhakar

కాంగ్రెస్ ప్రవేశ పెట్టిన ఆరు గ్యారెంటీ పథకాలను ఖచ్చితంగా అమలు చేస్తామని హామీ ఇచ్చారు మంత్రి పొన్నం ప్రభాకర్. ప్రజాపాలన దరఖాస్తుల డేటా ఎంట్రీ సాగుతుంది.. ధరణితో పాటు 317 జీవో జిల్లాల పునర్వ్యస్థీకరణ అంశాలను పరిశీలిస్తున్నామని ఆయన చెప్పుకొచ్చారు. 90 వేల కోట్ల రూపాయలు పెట్టి నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు 90 నెలలు కూడా లేదు.. నాణ్యతా లోపంతో కుంగిపోయింది అని మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు.

యాదాద్రి పవర్ ప్లాంట్ పై విజిలెన్స్ ఎంక్వైరీ చేస్తున్నాం.. బీఆర్ఎస్ నేతలు విచారణ జరపాలని సవాల్ చేశారు.. మేము ఎంక్వైరీ స్టార్ట్ చేయగానే ఎందుకు గాబరా పడుతున్నారు అని ఆయన ఎద్దేవా చేశారు. కిషన్ రెడ్డి కేసీఆర్ బినామీ.. కేసీఆర్ ని కాపాడేందుకు ప్రయత్నం చేస్తున్నారు.. మాజీ ఎంపీ వినోద్ సచ్చిలుడు అయితే అక్రమంగా ఉద్యోగం పొందిన వ్యక్తితో సంబంధం లేకపోతే ఫిర్యాదు ఎందుకు చేయడం లేదు.. బండి సంజయ్ డ్రామా ఆర్టిస్ట్ భావోద్వేగాలను రెచ్చగొట్టి పబ్బం గడుపుకునే ప్రయత్నం చేస్తున్నారు అని పొన్నం అన్నారు.