ఓవర్సీస్ లో దుమ్ములేపుతున్న వీరయ్య

మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేర్ వీరయ్య ఓవర్సీస్ లో కలెక్షన్ల వర్షం కురిపిస్తున్నాడు. బాబీ డైరెక్షన్లో మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో రవితేజ కీలక పాత్రలో శృతి హాసన్ హీరోయిన్ గా నటించిన ఈ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 13 న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దేవి శ్రీ అందించిన సాంగ్స్ బాగుండడం , రవితేజ – చిరంజీవి చాల కాలం తర్వాత నటించడం , మైత్రి మూవీ మేకర్స్ నిర్మించడం తో భారీ అంచనాల మధ్య సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి హిట్ టాక్ సొంతం చేసుకుంది. మొదటి రోజు మొదటి ఆటతోనే హిట్ టాక్ సొంతం చేసుకోవడం తో ప్రేక్షకులు , అభిమానులు సినిమాను బ్రహ్మ రధం పడుతున్నారు. దీంతో బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురుస్తుంది.

ఇప్పటికే వాల్తేరు వీరయ్య సినిమా 100 కోట్ల రూపాయల వసూళ్లు సాధించి 150 కోట్ల దిశగా దూసుకుపోతుంది. మరో రెండు మూడు రోజుల్లో ఈ ఫీట్ సాధించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇక ఓవర్సీస్ లో వన్ మిలియన్ మార్కును అధిగమించింది. సోమవారం నాటికి, ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద 1.9 మిలియన్లకు పైగా వసూళ్లు సాధించి రెండో మిలియన్ డాలర్ల కు అడుగు దూరం లో నిలిచింది. చిరంజీవి చిత్రం సైరా నరసింహా రెడ్డి, 2.6 మిలియన్ డాలర్ల వసూళ్లతో టాప్ లో ఉంది. అయితే ఇదే ట్రెండ్ కొనసాగితే, వాల్తేరు వీరయ్య ఖచ్చితంగా టాప్ కి వెళుతుందని రికార్డ్ బ్రేక్ చేస్తుందని ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి.

ఇక తెలుగు రాష్ట్రాల్లో నాల్గు రోజుల్లో ఈ మూవీ..నైజాంలో రూ. 20.31 కోట్లు, సీడెడ్‌లో రూ. 11.36 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 7.15 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 5.56 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 3.35 కోట్లు, గుంటూరులో రూ. 4.81 కోట్లు, కృష్ణాలో రూ. 4.12 కోట్లు, నెల్లూరులో రూ. 2.22 కోట్లతో కలిపి.. రూ. 58.88 కోట్లు షేర్, రూ. 95.60 కోట్లు గ్రాస్ వసూలు రాబట్టింది.