మునుగోడు లో అప్పుడే ప్రచారం మొదలుపెట్టిన రాజగోపాల్ రెడ్డి…

బిజెపి తీర్థం పుచ్చుకున్నారో లేదో అప్పుడే మునుగోడు లో కోమటిరెడ్డి రాజగోపాల్ ప్రచారం మొదలుపెట్టారు. రోడ్లపై కాలి నడకన తిరుగుతూ..కనిపించిన వారిని ఆప్యాయంగా పలకరిస్తూ.. వారి క్షేమ సమాచారాలు.. కష్ట సుఖాలు అడిగి తెలుసుకుంటూ ముందుకు సాగారు. అంతే కాదు కాకా హోటల్లో సామాన్యులతో కలసి టీ తాగి.. అక్కడున్న వారితో మాటా మంతీ జరిపారు. రాజగోపాల్ ను ఇలా చూసి ప్రజలంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మొన్నటివరకు నియోజకవర్గాన్ని పట్టించుకోని రాజగోపాల్..ఇప్పుడు సామాన్యుడిలా జనాల మధ్య తిరుగుతూ..మాట్లాడడం ఏంటి అని అంత మాట్లాడుకుంటున్నారు.

కాంగ్రెస్ పార్టీ నుండి గత ఎన్నికల్లో మునుగోడు మ్మెల్యే గా గెలిచినా రాజగోపాల్..రీసెంట్ గా కాంగ్రెస్ పార్టీ కి , తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసారు. నిన్న అమిత్ షా సమక్షంలో బిజెపి కండువా కప్పుకున్నారు. రాబోయే ఉప ఎన్నికల్లో బిజెపి తరుపున ఎమ్మెల్యే గా పోటీచేయబోతున్నారు. ఇక ఈ ఎన్నికలను అన్ని పార్టీలు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. టిఆర్ఎస్ పార్టీకి సిపిఐ , సిపిఎం పార్టీలు మద్దతు తెలుపడంతో..కాంగ్రెస్ , బిజెపి పార్టీ లు సింగిల్ గా బరిలోకి దిగబోతున్నాయి.