ఎడ్లబండి ఎక్కి సందడి చేసిన మంత్రి రోజా , అలీ

ఏపీలో సంక్రాంతి సంబరాలు అంబరాన్ని తాకుతున్నాయి. సినీ , రాజకీయ ప్రముఖులంతా సొంతూళ్లలో సందడి చేసారు. కోడి పందేల్లో పాల్గొని ఉత్సాహం నింపారు. ఇక మంత్రి రోజా మరోసారి తనదైన శైలిలో ఆకట్టుకున్నారు. చిత్తూరు జిల్లా నగరి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సంక్రాంతి సంబరాలు జరిపారు. కళాశాల ప్రాంగణానికి మంత్రి రోజా..వైస్సార్సీపీ నేత , సినీ నటుడు అలీతో కలిసి ఎద్దుల బండిపై వచ్చారు. ఈ సందర్బంగా మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు.

అలీతో కలిసి రోజా జాలీగా ఎడ్లబండిని తోలుతూ సందడి చేశారు. తోటి మహిళలకు గాజులు తొడిగి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇక సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్న అలీ చిలుకజోస్యం చెప్పించుకున్నారు. చిలుక జ్యోతిష్యుడు అలీకి రాజకీయంగా ఉన్నత భవిష్యత్తు ఉంటుందని తెలిపాడు.