‘విశ్వంభర’ షూటింగ్ కొత్త షెడ్యూల్ ప్రారంభం
మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న ‘విశ్వంభర’ సినిమా షూటింగ్ కొత్త షెడ్యూల్ ప్రారంభమైంది. ప్రస్తుతం లింగంపల్లిలోని అల్యూమినియం ఫ్యాక్టరీలో షూటింగ్ జరుగుతున్నట్లు సినీవర్గాలు వెల్లడించాయి. ఏప్రిల్ 19 వరకు ఈ షెడ్యూల్ కొనసాగనుందట. వశిష్ఠ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో త్రిష ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తుండగా.. రమ్య పసుపులేటి, సురభి ఈషా చావ్లా, ఆష్రిత వేముగంటి నండూరి కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ బ్యానర్పై వంశీ, ప్రమోద్ విక్రమ్ తెరకెక్కిస్తుండగా.. ఆర్ఆర్ఆర్ ఫేం లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి బ్యాక్ గ్రౌండ్ స్కోర్, సంగీతం అందిస్తున్నారు. ఇటీవల విడుదల చేసిన విశ్వంభర కాన్సెప్ట్ వీడియో మిలియన్ల సంఖ్యలో వ్యూస్ రాబడుతోంది. మరోవైపు టైటిల్ లుక్, కాన్సెప్ట్ వీడియో సినిమాపై క్యూరియాసిటీతోపాటు అంచనాలు అమాంతం పెంచేస్తుంది ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి 10న థియేటర్లలోకి రానుంది.