గాంధీ భవన్ వద్ద విష్ణు అనుచరుల ఆందోళన

కాంగ్రెస్ అధిష్టానం జూబ్లీహిల్స్ టికెట్ తనకు కాకుండా అజారుద్దీన్ కు కేటాయించడం ఫై విష్ణు అధిష్టానం ఫై ఆగ్రహం వ్యక్తం చేసారు. నిన్న కాంగ్రెస్ పార్టీ 45 మంది అభ్యర్థులతో రెండో జాబితాను విడుదల చేసింది. విష్ణువర్ధన్ రెడ్డి జూబ్లీహిల్స్ టిక్కెట్‌పై ఆశలు పెట్టుకున్నప్పటికీ ఈ స్థానం నుంచి కాంగ్రెస్ అజారుద్దీన్ పేరును ప్రకటించింది. దీంతో విష్ణువర్ధన్ రెడ్డి తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఆయన అనుచరులతో భేటీ అనంతరం తన నిర్ణయం ప్రకటిస్తానని వెల్లడించారు.

ఈ క్రమంలో విష్ణు అనుచరులు గాంధీ భవన్ వద్ద నేడు ఆందోళన నిర్వహించారు. గాంధీ భవన్ లోనికి వెళ్లకుండా ప్రధాన ద్వారానికి తాళం వేసి ఉంది. దీంతో ఇటుకలతో తాళం పగులగొట్టేందుకు వారు ప్రయత్నించారు. రేవంత్ బొమ్మను కిందపడేసి దగ్ధం చేయబోయారు. కాంగ్రెస్ కండువాలు దగ్ధం చేసారు. దీంతో కాసేపు గాంధీ భవన్ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. పోలీసులు చేరుకొని అందర్నీ చెదరగొట్టారు.