వైస్సార్సీపీ సీనియర్ నేత కన్నుమూత

వైస్సార్సీపీ పార్టీ లో విషాదం నెలకొంది. విశాఖ జిల్లాలో వైఎస్సార్‌సీపీ సీనియర్ నేత , జిల్లా పరిషత్‌ వైస్‌ ఛైర్మన్ తుంపాల అప్పారావు కన్నుమూశారు. కొంతకాలం నుంచి అనారోగ్యంతో బాధపడుతున్నఅప్పారావు.. ఈ క్రమంలోనే ఆయనకు గోపాలపట్నలోని ఒక ప్రైవేటు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆదివారం ఆరోగ్యం విషమించి కన్నుమూశారని కుటుంబ సభ్యులు తెలిపారు.

విశాఖపట్నం జిల్లా సబ్బవరం జెడ్పీటీసీ సభ్యుడిగా తుంపాల అప్పారావు ఎన్నికయ్యారు. అనంతరం విశాఖ పట్నం జిల్లా పరిషత్ వైస్ ఛైర్మన్ గా కూడా ఎంపికయ్యారు. అప్పారావు మరణ వార్త తెలుసుకున్న పెందుర్తి ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్‌రాజ్‌ తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు మర్రిపాలెం వెళ్లి అప్పారావు భౌతికకాయాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. సోమవారం అప్పారావు అంత్యక్రియలు నిర్వహిస్తామని కుటుంబ సభ్యులు తెలిపారు.