షూటింగ్ పూర్తి చేసుకున్న విరూపాక్ష
సాయి ధరమ్ తేజ్ – సంయుక్త జంటగా కార్తీక వర్మ దండు డైరెక్షన్లో సుకుమార్ రైటింగ్స్, శ్రీవెంకటేశ్వర సినీ చిత్ర సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం విరూపాక్ష . ఈ మూవీ తాలూకా షూటింగ్ మొత్తం పూర్తి అయినట్లు చిత్ర యూనిట్ అధికారిక ప్రకటన చేసారు. ఒక్క పాట మినహా మొత్తం షూటింగ్ను కంప్లీట్ చేసినట్టు సాయితేజ్ ట్వీట్ చేశాడు. చిత్ర సిబ్బందితో కలిసి దిగిన ఫొటోను షేర్ చేశాడు. ఏప్రిల్ 21 న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
కాంతార ఫేం అంజనీశ్ లోక్నాథ్ విరూపాక్ష చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర-సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై బీవీఎస్ఎన్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. విరూపాక్షలో బ్రహ్మాజీ, అజయ్, సునీల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సాయిధరమ్ తేజ్ మరోవైపు సముద్రఖని దర్శకత్వంలో వినోదయ సీతమ్ తెలుగు రీమేక్లో నటిస్తున్నాడు. ఈ మూవీ లో పవన్ కళ్యాణ్ ఓ కీలక రోల్ చేస్తుండడం విశేషం. జులై 28 న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.