ఈ నెల 28న హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్ష‌లు

ఆగస్టు 28 న హైదరాబాద్ లో ర‌న్న‌ర్స్ మారథాన్ నేప‌థ్యంలో నెక్లెస్ రోడ్డులోని పీపుల్స్ ప్లాజా నుంచి గ‌చ్చిబౌలి స్టేడియం వ‌ర‌కు ట్రాఫిక్ ఆంక్ష‌లు అమల్లోకి రానున్నాయి. అవ‌స‌ర‌మైన చోట ఉద‌యం 4:30 నుంచి 10 గంట‌ల వ‌ర‌కు ట్రాఫిక్ మ‌ళ్లిస్తామ‌ని పేర్కొన్నారు ట్రాఫిక్ పోలీసులు.

లిబ‌ర్టీ జంక్ష‌న్ నుంచి అప్ప‌ర్ ట్యాంక్ బండ్ వైపు వ‌చ్చే వాహ‌నాల‌ను అంబేద్క‌ర్ విగ్ర‌హం వ‌ద్ద దారి మ‌ళ్లిస్తారు. ఇక్బాల్‌ మీనార్ యూ ట‌ర్న్ నుంచి తెలుగు త‌ల్లి ఫ్లై ఓవ‌ర్ మీదుగా లోయ‌ర్ ట్యాంక్ బండ్, క‌ట్ట‌మైస‌మ్మ టెంపుల్ మీదుగా వాహ‌నాల‌ను అనుమ‌తిస్తారు. క‌వాడిగూడ క్రాస్‌రోడ్స్ నుంచి సెయిలింగ్ క్ల‌బ్ వైపున‌కు వాహ‌నాల‌ను అనుమ‌తించ‌రు. మినిస్ట‌ర్ రోడ్డు నుంచి రాణిగంజ్ మ‌ధ్య కూడా వాహ‌నాల‌ను అనుమ‌తించ‌రు. నెక్లెస్ రోడ్డు వైపు వ‌చ్చే వాహ‌నాల‌ను న‌ల్ల‌గుట్ట జంక్ష‌న్ వ‌ద్ద‌నే మ‌ళ్లిస్తారు. బేగంపేట నుంచి రాజ్‌భ‌వ‌న్‌, బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్ కు వెళ్లే వాహ‌నాల‌ను గ్రీన్ ల్యాండ్స్ జంక్ష‌న్ నుంచి డీకే రోడ్ మీదుగా వాహ‌నాల‌కు అనుమ‌తిస్తారు. నాగార్జున స‌ర్కిల్ నుంచి కేబీఆర్ పార్క్ వ‌ర‌కు ఉద‌యం 9 గంట‌ల వ‌ర‌కు వాహ‌నాల‌ను నిలిపివేయనున్నారు.

పంజాగుట్ట, రాజ్‌భ‌వ‌న్ నుంచి ఖైర‌తాబాద్ ఫ్లై ఓవ‌ర్, నెక్లెస్ రోడ్డు వైపు వెళ్లే వాహ‌న‌దారులు ఖైర‌తాబాద్ జంక్ష‌న్, షాదాన్ కాలేజీ, నిరంకారి భ‌వ‌న్ నుంచి ర‌వీంద్ర భార‌తి మీదుగా వెళ్లాలని సూచించారు. ఖైర‌తాబాద్ ఫ్లై ఓవ‌ర్, షాదాన్ కాలేజీ నుంచి బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్ వెళ్లే వాహ‌న‌దారులు తాజ్ కృష్ణ‌, రోడ్ నంబ‌ర్ 10, 12, క్యాన్స‌ర్ హాస్పిట‌ల్ మీదుగా జూబ్లీహిల్స్ చేరుకోవ‌చ్చు. ఇక్బాల్ మీనార్ నుంచి అప్ప‌ర్ ట్యాంక్ బండ్‌కు వ‌చ్చే వాహ‌నాల‌ను తెలుగు త‌ల్లి ఫ్లై ఓవ‌ర్ మీదుగా మళ్లించనున్నారు.