వికారాబాద్ జిల్లాలో జరిగిన మహిళ హత్య కేసులో సంచలన విషయాలు

వికారాబాద్ జిల్లాలో జరిగిన మహిళ హత్య కేసులో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. ఈ హత్య చేసింది బాబు అలియాస్ రామస్వామి గా పోలీసులు తేల్చారు. బాబును పోలీసులు సీరియల్ కిల్లర్‌గా గుర్తించారు. ఒంటరి మహిళలను టార్గెట్ చేస్తూ.. సహజీవనం చేసి.. ఆ తర్వాత హతమారుస్తున్నట్లు నిర్ధారించారు. ఇక ఇతన్ని విచారించగా..కీలక విషయాలు బయటకొచ్చాయి.

వికారాబాద్‌ జిల్లా పుల్‌మద్ది గ్రామం శివారు పరిధిలో చేవెళ్లకు చెందిన అనసూయ అనే మహిళను రామస్వామి దారుణంగా హత్య చేసిన విషయం తెలిసిందే. అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లి మెడకు కొంగు బిగించి, పెట్రోల్ పోసి తగులబెట్టారు. స్థానికుల సమచారంతో ఘటనా స్థలానికి వెళ్లిన పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఈ కేసును సీరియస్‌గా తీసుకొని దర్యాప్తు చేసిన పోలీసులు అసలు వివరాలు వెలికి తీస్తున్నారు. కాగా, అనసూయను హత్య చేసిన అనంతరం కాళ్ల కడియాలు, చెవి దిద్దులను రామస్వామి ఎత్తుకెళ్లడం గమనార్హం.