వైసీపీ తుది ఇంచార్జ్ ల జాబితా విడుదల

ఏపీలో మరో మూడు నెలల్లో ఎన్నికలు జరగనున్న క్రమంలో అధికార పార్టీ వైసీపీ నియోజకవర్గాల ఇంచార్జ్ లను ప్రకటిస్తూ వస్తుంది. ఇప్పటికే మూడు విడతల్లో జాబితా లిస్ట్ ను విడుదల చేయగా..గురువారం తుది జాబితా ను రిలీజ్ చేసింది. మొత్తం 9 మందితో కూడిన జాబితాను ప్రకటించారు. ఇందులో ఒకరు ఎంపీ కాగా..మిగిలిన 8 మంది అసెంబ్లీ ఇంచార్జులుగా ఖరారు చేశారు. సింగనమల శాసనసభ ఇంచార్జిగా వీరాంజనేయులు, చిత్తూరు ఎంపీ రెడ్డప్ప స్థానంలో డిప్యూటీ సీఎం నారాయణ స్వామి, జీడీ నెల్లూరు శాసన సభ ఇంచార్జిగా రెడ్డప్పను ఖరారు చేశారు.

గోపాలపురం (ఎస్సీ)-తానేటి వనిత

తిరువూరు (ఎస్సీ)- నల్లగట్ల స్వామిదాస్

కొవ్వూరు (ఎస్సీ) తలారి వెంకట్రావు

కనిగిరి- దద్దాల నారాయణ యాదవ్

మడకశిర (ఎస్సీ)- ఈర లక్కప్ప

నందికొట్కూరు (ఎస్సీ)- డా. సుధీర్ దారా