వాలంటీర్లపై వ్యాఖ్యలు..పవన్ కల్యాణ్ పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు
పవన్ పై కృష్ణలంక పోలీసులకు ఫిర్యాదు చేసిన వాలంటీర్ సురేశ్
అమరావతిః వాలంటీర్లపై జనసేన అధినేత చేసిన ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. మహిళల అక్రమ రవాణాలకు కొందరు వాలంటీర్లు సహకరిస్తున్నారంటూ పవన్ సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఏలూరు వారాహి యాత్రలో ఆయన ఈ ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలో ఆయనపై విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో కేసు నమోదయింది. పవన్ పై సురేశ్ అనే వాలంటీర్ కృష్ణలంక పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 405 / 2023 కింద సురేశ్ ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు పవన్ పై ఐసీపీ 153, 153 ఏ, 502 (2) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.