కేసీఆర్‌ ఆరోగ్యంగా ఉండాలంటూ విజయశాంతి ట్వీట్

బిఆర్ఎస్ అధినేత , మాజీ సీఎం కేసీఆర్ రీసెంట్ గా తన ఫామ్ హౌస్ లో జారీ పడడంతో అయన తుంటి ఫ్రాక్చర్ అయినా సంగతి తెలిసిందే. వారం రోజుల పాటు యశోద లో చికిత్స తీసుకొని నిన్ననే నందినగర్ లోని తన ఇంటికి వెళ్లారు. కేసీఆర్ ప్రమాదానికి గురయ్యారని తెలిసి రాజకీయ పార్టీల నేతలు , సినీ ప్రముఖులు ఆయన్ను చూసి..ఆరోగ్య వివరాలు అడిగితెలుసుకున్నారు.

తాజాగా కాంగ్రెస్ నేత విజయశాంతి కేసీఆర్ ఆరోగ్యంగా ఉండాలంటూ ట్వీట్ చేసింది. బీఆర్ఎస్ అధ్యక్షులు కేసీఆర్ గారు.. సర్జరీ తర్వాత హాస్పిటల్ నుంచి బయటకు వచ్చిన మీరు, ఆరోగ్యంతో నూరేళ్ళు బాగుండాలని కోరారు. అందుకు ఆ భగవంతుని ఆశీస్సులు మీకు ఎల్లప్పుడు ఉంటూనే ఉండాలి…రాజకీయాలు, పార్టీలకతీతంగా…మనం కలిసి తెలంగాణ కై కొట్లాడిన ఉద్యమకారులుగా…మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని విజయశాంతి ట్వీట్‌ చేశారు.