ఢిల్లీలో నమ్మశక్యం కాని ఘటన

దేశ రాజధాని ఢిల్లీ లో నమ్మశక్యం ఘటన వెలుగులోకి వచ్చింది. 8 వ తరగతి చదువుతున్న సౌరభ్‌ అనే విద్యార్థిని తోటి విద్యార్థులు అతి కిరాతకంగా హత్య చేసారు. బదర్‌పూర్ ప్రాంతంలోని కాలువలో విద్యార్థి మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు.

వివరాల్లోకి వెళ్తే..

మోలడ్‌బంద్ గ్రామ బిలాస్‌పూర్ క్యాంపులో నివసించే సౌరభ్‌ అనే విద్యాధి..స్థానిక పాఠశాలలో 8 వ తరగతి చదువుతున్నాడు. కాగా సౌరభ్ స్నేహితులు ఇద్దరు తమ స్కూల్ సమీపంలో సిగరెట్ తాగుతూ అతడి కంట పడ్డారు. దీంతో, టీచర్లకు ఫిర్యాదు చేస్తానని సౌరభ్ హెచ్చరించడం తో.. వారు అతడి తలపై తీవ్రంగా కొట్టి చంపేశారు.

బదర్‌పూర్ ప్రాంతంలోని కాలువలో గురువారం రాత్రి పోలీసులకు స్కూల్ యూనిఫాంలో ఉన్న సౌరభ్ మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. మృతదేహం పక్కన విద్యార్థి స్కూల్ బ్యాగ్ కూడా కనిపించింది. దీని ఆధారంగా పోలీసులు బాలుడి వివరాలు సేకరించారు. బాలుడి మృతదేహాన్ని ఎయిమ్స్‌కు తరలించిన పోలీసులు, ఇద్దరు విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు. జువెనైల్ జస్టిస్ బోర్డు ఎదుట హాజరుపరిచారు.